
రష్యాలోని పెర్మ్ రీజియన్లోని లూక్ఆయిల్ రిఫైనరీ మరియు రియాజన్లోని చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు నిర్వహించింది.
ఈ రెండు రిఫైనరీల ఉమ్మడి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 కోట్ల టన్నులు అని, ఈ దాడుల వల్ల రష్యా ఇంధన అవసరాలకు భారీ నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ ప్రకటించింది.
రియాజన్ గవర్నర్ పావెల్ మాల్కోవ్ తెలిపిన వివరాల ప్రకారం, పారిశ్రామిక వాడల్లో జరిగిన ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులు గాయపడి ఆసుపత్రిలో చేరారు.