
ఆన్లైన్ మోసాలకు గురైన వెంటనే బాధితులు 1930 నంబర్కు ఫిర్యాదు చేస్తే, మోసగాళ్ల ఖాతాల నుంచి నగదును రికవరీ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
సైబర్ నేరగాళ్లు కేవైసీ అప్డేట్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడుల పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.
బాధితులు లావాదేవీల వివరాలు, స్క్రీన్షాట్లు, ఫోన్ నంబర్లు వంటి ఆధారాలను భద్రపరచుకోవాలని, అవగాహన కోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.