
వైసీపీలో జగన్ మోహన్ రెడ్డి మాత్రమే నేత అని, మిగిలిన వారంతా కార్యకర్తలని సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
విజయసాయిరెడ్డి ఆరోపణలను ఖండించిన సజ్జల, పార్టీలో ఆయనకు నంబర్-2 స్థానం కల్పించినా సొంత కారణాలతోనే పార్టీని వీడారని తెలిపారు.
2024 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, పార్టీ వేగంగా పుంజుకుంటోందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.