
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జమ్ము జంక్షన్ వద్ద భద్రాచలం నుంచి పలాస వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సు వెనుక సీటులో ప్రారంభమైన మంటలు క్షణాల్లో వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది.
అప్రమత్తమైన ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది.