
మైనింగ్ రాయల్టీ వసూలు చేస్తున్న ఏఎంఆర్ కంపెనీపై కోల్కతాలో నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్, దిల్లీ, కోల్కతా అలాగే ఝార్ఖండ్లోని ఏఎంఆర్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ సోదాలకు సంబంధించి సంస్థ నుంచి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.