
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఢిల్లీలోని శివమార్కెట్లో ఉన్న మూడు నకిలీ సైబర్ నేర కాల్ సెంటర్లపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
ఈ దాడుల్లో భాగంగా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు తెలుగు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశ రాజధానిలో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు ఈ దాడులను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.