
ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమ నిజమైన శత్రువును గుర్తించి ఐక్యంగా ఉండాలని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు.
మొహమ్మద్ ప్రవక్త జయంతి వారోత్సవం సందర్భంగా టెలిగ్రామ్ ద్వారా ఆయన ఈ సందేశాన్ని విడుదల చేశారు.
ముస్లిం దేశాల మధ్య అనైక్యత వల్ల పాలస్తీనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.