భూకంపాలు, కొండచరియలు, మెరుపు వరదలు వంటి వరుస ప్రకృతి వైపరీత్యాలతో నేపాల్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
తరచూ రాజకీయ సంక్షోభాలు, నాయకత్వ వైఫల్యాలతో సతమతమవుతున్న నేపాల్ను 'సతి శపించిన దేశం' (సతి లె సరాపేకో దేశ్) అని జానపద గాథల ద్వారా పిలుస్తుంటారు.
17వ శతాబ్దంలో భీమ్ మల్ల అనే సేనాధిపతికి జరిగిన అన్యాయం, ఆయన భార్య భువనలక్ష్మి శాపం వెనుక ఉన్న విషాద గాథ నేటికీ ఆ దేశ సామాజిక పరిస్థితులకు ప్రతీకగా నిలుస్తోంది.