
భోగాపురం విమానాశ్రయంలో భద్రతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని సీఐఎస్ఎఫ్ డీజీ ప్రవీణ్ రంజన్ స్పష్టం చేశారు.
ప్రయాణికులకు స్నేహపూర్వక సేవలు అందించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పించడం తమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్షించారు.