
గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.
శ్రీలంక డెబ్యూ బౌలర్ కేశర నువాంత 39 ఓవర్లలో 175 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు ఇచ్చిన నాలుగో బౌలర్గా నిలిచాడు.
ఈ జాబితాలో 2010లో 222 పరుగులు ఇచ్చిన సూరజ్ రన్దివ్ అగ్రస్థానంలో ఉండగా, తరిందు రత్ననాయకే 196 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.