వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ ఆగస్టు 15 నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుత మార్కెట్ దిగ్గజాలు వసూలు చేస్తున్న 16-30 శాతం కమీషన్కు భిన్నంగా, ఫ్లిప్కార్ట్ కేవలం 10 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయనుంది.
ఈ సేవలు ప్రభుత్వ మద్దతు ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వేదికపై పనిచేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.