
లక్నోలో జరిగిన యూపీ టీ20 ఫైనల్లో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్పై మీరట్ మేవరిక్స్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఓపెనర్ దివ్యాంశ్ జోషి 40 బంతుల్లో 105 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా, మీరట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది.
రింకు సింగ్ కెప్టెన్సీలో మీరట్ మేవరిక్స్ జట్టుకు ఇది రెండో టైటిల్ కాగా, ఈ టోర్నీలో ఆడిన 10 మ్యాచ్లలో 9 విజయాలను నమోదు చేసింది.