
మనుషుల కంటే తెలివైన ఏఐ వ్యవస్థలు దశాబ్దం ముగిసేలోపే మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ హెచ్చరించారు.
ఏఐ సంస్థల మధ్య జరుగుతున్న ప్రమాదకర పోటీ వల్ల సూపర్ఇంటెలిజెన్స్ ఏర్పడితే, దానిని నియంత్రించడం కష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంత్రోపిక్ అలైన్మెంట్ సైన్స్ లీడ్ ఇవాన్ హుబింగర్ అంచనా ప్రకారం, వచ్చే పదేళ్లలో ఏఐ వల్ల మానవాళి అంతం అయ్యే ప్రమాదం 10 శాతానికి పైగా ఉంది.