
విద్యార్థుల్లో అభ్యసన భయాన్ని తొలగించి, భాషా మరియు గణిత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ 'రెమిడీయేషన్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రాథమిక స్థాయిలో అమలు చేస్తోంది.
కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం దేశంలో 18వ స్థానంలో ఉన్న లోపాన్ని అధిగమించేందుకు వారంలో రెండు రోజులు చొప్పున తెలుగు, గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సమయం కేటాయిస్తున్నారు.
ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు 10 కంటే తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.