
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం జరిగిన మంత్రి సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పరకాల నుండి టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు.
ఈ వివాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ను కోరగా, కమిటీ చైర్మన్ మల్లు రవి లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.