
సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో వనదేవతలను దర్శించుకుని, మంత్రి సీతక్క నుంచి ముందస్తుగా రాఖీ స్వీకరించారు.
ములుగు పర్యటనలో భాగంగా 868 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం, కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
ఈ పర్యటనలో వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీని ప్రారంభించిన రేవంత్ రెడ్డి, సాయంత్రం వరంగల్ జిల్లా పరకాలలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.