
ఇస్రో శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 17 వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది.
ఈ వ్యోమనౌక ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని సబ్-జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది.
శత్రు దేశాల సైనిక స్థావరాలను పసిగట్టడంతో పాటు ప్రకృతి విపత్తులను అంచనా వేయడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది.