
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పెద్దతండ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వాసు డ్యూయల్ డెస్క్ బెంచీలను విరాళంగా అందించారు.
విద్యార్థులు నేలపై కూర్చోవడం గమనించిన సర్పంచ్ వడ్త్యావత్ శ్రీను నాయక్ కోరిక మేరకు ఈ సాయం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వరిమోహన్, వార్డు సభ్యులు, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.