
ఆగస్టు 14, 2026 సాయంత్రం 7.30 గంటల నుంచి సాంకేతిక కారణాలతో యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ మెట్రోలో డిజిటల్ పేమెంట్స్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చింది.