
రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితుడైన ప్రదోష్ అప్రూవర్గా మారి, ఘటనకు సంబంధించిన కీలక వివరాలను న్యాయస్థానానికి వెల్లడించారు.
దర్శన్ తనను బెదిరించారని, రేణుకాస్వామిపై దాడి చేసి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ప్రదోష్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
జైలులో తన భద్రతకు ముప్పు ఉందని, ఇతర నిందితులతో కాకుండా తనను ప్రత్యేక సెల్లో ఉంచాలని ప్రదోష్ కోర్టును కోరారు.