
ఉక్రెయిన్లోని క్రివీ రిగ్లో ఉన్న లక్ష్మీ మిట్టల్కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్పై ఆగస్టు 16న రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఇద్దరు మృతి చెందారు.
ఈ దాడిలో 14 మంది కార్మికులు గాయపడటంతో ప్లాంట్ కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేశారు, అలాగే సుమీ నగరంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
రష్యా రక్షణ శాఖ ఈ దాడిని సమర్థించుకుంటూ, ఉక్రెయిన్ తయారు చేస్తున్న 'ఫ్లెమింగో' లాంగ్ రేంజ్ మిస్సైల్ తయారీ కేంద్రమే తమ లక్ష్యమని పేర్కొంది.