
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం సమీపంలో 300 ఎకరాలు మాజీ సీఎం కేసీఆర్ కబ్జాలో ఉందని తేలితే భారాస ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధమని మాజీమంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు.
కబ్జా లేదని తేలితే సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.
సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్మీట్లో హరీశ్రావు ఈ సవాల్ చేశారు.