
ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ కార్యాలయంపై సోమవారం రాత్రి డ్రోన్ల దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ దాడి వెనుక విదేశీ కుట్ర ఉందని కుర్దిస్థాన్ ప్రభుత్వం ఆరోపించింది.
ప్రధాని కార్యాలయంతో పాటు పరాస్తిన్ చీఫ్ నివాసంపై కూడా డ్రోన్ల దాడి జరిగినట్లు సమాచారం.