
నమీబియాలో జరిగిన ముక్కోణపు టీ20 టోర్నీలో, 20 ఏళ్ల 161 రోజుల వయసున్న లూహాన్ ప్రిటోరియస్ సెంచరీ సాధించి, ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ తరపున అతి పిన్న వయస్కుడైన సెంచరీ వీరుడిగా రికార్డు సృష్టించాడు.
శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో నమీబియాపై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది.
ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు జింబాబ్వేతో తలపడనుంది.