
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ను గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా సంప్రదించి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.
డబ్బులు ఇవ్వకపోతే డీప్ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు మరియు వీడియోలను బయటపెడతామని నిందితులు ఎమ్మెల్సీని హెచ్చరించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.