
కర్ణాటకలోని మైసూరు జిల్లా గౌరీపుర గ్రామంలో చిప్స్ ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బంతిని మింగి మూడేళ్ల మయూర్ అనే బాలుడు మరణించాడు.
ఆడుకుంటున్న సమయంలో బాలుడు పొరపాటున ప్లాస్టిక్ బంతిని ఆహారమని భావించి నోట్లో వేసుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది.
చికిత్స కోసం హుణసూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.