
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ముంబై పోలీసులు గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఈ కేసును నిర్లక్ష్యంగా ప్రమాదవశాత్తు మరణంగా పరిగణించడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 44 పేజీల తీర్పును వెలువరించింది.
2020 జూన్ 8న మలాడ్ లోని భవనం పైనుంచి పడి దిశా మరణించగా, ఆమె తండ్రి సతీష్ సాలియాన్ ఫిర్యాదు మేరకు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.