
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది.
వ్యాపారి గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు సుమంత్తో పాటు మరో ఐదుగురిపై 109 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును జీరో ఎఫ్ఐఆర్ ద్వారా నమోదు చేసి, తదుపరి విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు.