
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ తన తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లు తీశారు.
మరో సెమీఫైనల్లో నార్త్ జోన్ జట్టు 195 పరుగులకే కుప్పకూలగా, సౌత్ జోన్ బౌలర్ విద్వత్ కావేరప్ప నాలుగు వికెట్లతో రాణించాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసి క్రీజులో ఉంది.