
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్ పార్టీ మారి కాంగ్రెస్లో చేరడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం దానంపై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.