
న్యూయార్క్లో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ డీఎన్ఏలోనే ఉందని, దీనిని అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు.
అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ (AHEAD) ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో, మనుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
భాగవత్ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్పందిస్తూ, మాటల్లోని స్ఫూర్తి చేతల్లో కూడా కనిపించాలని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.