
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో టీమిండియా వైఫల్యాలపై సమీక్షించేందుకు సెప్టెంబర్ 3న ముంబైలో బీసీసీఐ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.
బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగే ఈ భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరుకానున్నారు.
ఆటగాళ్ల తరచు గాయాలు, భవిష్యత్తు సిరీస్ల వ్యూహాలు, ముఖ్యంగా న్యూజిలాండ్ పర్యటన కోసం 5 నుంచి 6 మంది పేసర్ల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.