
దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దృష్ట్యా 2030 నాటికి 13.2 లక్షల ఛార్జింగ్ పాయింట్లు అవసరమని రుబిక్స్ డేటా సైన్సెస్ నివేదిక వెల్లడించింది.
2026 ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా కేవలం 67,657 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, అందులో 73 శాతం 30 కిలోవాట్ల కంటే తక్కువ సామర్థ్యం కలిగినవే.
ప్రస్తుతం ఛార్జింగ్ స్టేషన్ల వినియోగం కేవలం 1 నుండి 5 శాతం మధ్యే ఉండటంతో ఆపరేటర్ల ఆదాయంపై ప్రభావం పడుతోందని నివేదిక పేర్కొంది.