
అమరావతిలో నిర్మించబోయే అసెంబ్లీ భవనాన్ని 265 అసెంబ్లీ, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
భవనం పైభాగంలో టవర్ ఏర్పాటు చేసి, అక్కడి నుండి రాజధాని ప్రాంతాన్ని వీక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సందర్శకుల కోసం ప్రత్యేక ఎక్స్పీరియన్స్ సెంటర్, సెంట్రల్ హాల్ మరియు పచ్చదనంతో కూడిన గార్డెన్లను అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు.