
అమెరికా నిర్వహించిన తాజా గ్లోబల్ సర్వేలో భారత్ మరియు పాకిస్థాన్ ప్రజలు ఒకరినొకరు అతిపెద్ద ముప్పుగా భావిస్తున్నట్లు వెల్లడైంది.
36 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథంపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి రాగా, పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.