అక్టోబర్ నెల నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లను దశల వారీగా మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్హులకు పింఛన్లు అందించాలని మంత్రులకు ఆయన సూచించారు.
కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో సమావేశమైన లోకేశ్, స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.