
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విజయనగరం జిల్లాలో రూ. 17,900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు.
ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఎయిర్ కార్గో సదుపాయం ద్వారా పలాస జీడి, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు అంతర్జాతీయ మార్కెట్ మార్గం సుగమం కానుంది.
భవిష్యత్తులో భోగాపురం నుంచి మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు వరకు ఆరులేన్ల రహదారిని నిర్మించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.