
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకాన్ని ప్రకటించగా, దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందనున్నాయి.
వచ్చే ఏడాది పొంగల్ పండుగ నుంచి అమలు కానున్న ఈ పథకం ద్వారా సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుండగా, రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.4,000 కోట్ల భారం పడనుంది.
అక్టోబర్ 2 నుంచి మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ, పరందూర్లో రెండో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంటున్నట్లు సీఎం విజయ్ వెల్లడించారు.