
ఏఐ మరియు రోబోటిక్స్ సాంకేతికత వల్ల 2036 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయి, డబ్బు అవసరం లేని స్థితి వస్తుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
వస్తువుల ఉత్పత్తి విపరీతంగా పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం కంటే ద్రవ్యసంకోచం ప్రధాన సవాలుగా మారుతుందని ఆయన తన ఇంటర్వ్యూలో వివరించారు.
మరో ఐదేళ్లలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళి ఉమ్మడి తెలివితేటలను మించిపోతుందని, దీనివల్ల కలిగే ప్రమాదాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని మస్క్ అంచనా వేశారు.