
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో చైనా జోడీపై విజయం సాధించి ట్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ జోడీ సెమీఫైనల్కు చేరుకుంది.
గంటా 9 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో భారత జోడీ 16–21, 21–15, 21–13 స్కోరుతో ప్రత్యర్థిని ఓడించి భారత్కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది.
2011లో జ్వాలా గుత్తా–అశ్విని పొన్నప్ప తర్వాత 15 ఏళ్లకు ఈ విభాగంలో పతకం సాధించిన భారత జోడీగా ట్రీసా-గాయత్రి నిలిచారు.