హైదరాబాద్లో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేసిన టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లాపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ట్రోలింగ్పై 'సిగ్మా' ప్రెస్ మీట్లో స్పందించిన ఆమె, సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని తాను అందరి ఆలోచనలను గౌరవిస్తానని తెలిపారు.
తాను నటించిన తొలి తమిళ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.