
అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయనే ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 5 శాతం తగ్గి 83.5 డాలర్లకు చేరింది.
ఈ పరిణామంతో సోమవారం ఉదయం సెన్సెక్స్ 519 పాయింట్లు పెరిగి 78,613 వద్ద, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 24,557 వద్ద ట్రేడవుతున్నాయి.
డాలర్తో రూపాయి మారకం విలువ 95.13గా ఉండగా, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.