
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో ఆగి ఉన్న సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న దీప మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారని బంధువులు తెలిపారు.