
హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
2019 ఇంటర్ ఫలితాల గందరగోళం మరియు గ్లోబరీనా కంపెనీ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు.
ఈ కేసులో భాగంగా మాజీ ఇంటర్ సెక్రెటరీ అశోక్ను విచారించడంతో పాటు గ్లోబరీనా సంస్థ కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు.