
ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు వెళ్తున్న బ్లాక్ బీఎండబ్ల్యూ కారు లొటస్ జెట్టీ సమీపంలో అదుపుతప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టి కిందపడింది.
ఈ ప్రమాదం ఆదివారం ఉదయం సుమారు 5:20 గంటలకు జరిగిందని, అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.