పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీర ప్రాంతంలో గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీయనున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.