తెలంగాణ అటవీ శాఖలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం తీసుకునే ముందు మంత్రి కొండా సురేఖకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, అధికారులు పీసీసీఎఫ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
మంత్రి కొండా సురేఖపై పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలన కొనసాగుతున్న తరుణంలోనే ఈ పరిపాలనా నిర్ణయం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.