
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఢిల్లీలో ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 22ఏ జాబితా నుంచి ఎన్ని వేల ఎకరాలు తొలగించారో బడా కంపెనీలు, మంత్రుల బినామీల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పడం స్కామ్ను ఒప్పుకోవడమేనని లక్ష్మణ్ పేర్కొన్నారు.