
పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, నిర్వహణ వ్యయాల కారణంగా సెప్టెంబర్ 1 నుంచి కార్ల ధరలను 1 శాతం వరకు పెంచుతున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది.
ఈ ఏడాది హ్యుందాయ్ ధరలను పెంచడం ఇది మూడోసారి కాగా, జనవరిలో 0.6 శాతం, జూన్లో 1 శాతం మేర ధరలు పెరిగాయి.
మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి ఇతర కంపెనీలు కూడా ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే తమ వాహనాల ధరలను పెంచాయి.