
తెలంగాణ ట్రాన్స్కోలో 26 శాతం వాటాను విక్రయించి నిధులు సమీకరించాలని తెలంగాణ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది.
ప్రస్తుతం రూ.68 వేల కోట్ల ముఖ విలువ కలిగిన ఈ సంస్థలో, సెబీ నిబంధనల ప్రకారం ఐపీవో ద్వారా వాటాలను విక్రయించేందుకు ప్రైస్వాటర్హౌస్కూపర్ను కన్సల్టెన్సీగా నియమించారు.
ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తుండగా, సంస్థకు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని ఉద్యోగులు బయటకు వెల్లడించకూడదని హెచ్చరించారు.